ఒకటా,రెండా…దాదాపు 24గంటలు కావస్తున్నా..చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి జాడ కనిపించలేదు.గజఈత గాళ్లు, పోలీసులు..విశ్వప్రయత్నాలు చేసినా…సదరు వ్యక్తి తాలూకా ఆచూకి…ఒక్కటంటే ఒక్కటికూడా కనిపెట్టలేకపోయారు…గుర్తించలేకపోయారు. ‘గులాబ్’ తుపాను..పుణ్యమా…విజయనగరం లోకురిసిన కుండ పోత వర్షంతో ప్రధాన రోడ్లన్నీ చెరువులనే తలపించాయి.
అయితే ఈ అలజడిలోనే… ధర్మపురి లో గేదెల రామ్మోహనరావు అనే వ్యక్తి చెరువు లో చేపలు పట్టేందుకుని వెళ్లి ఒక్క రోజు గడిచింది.ఇంకా అతని ఆచూకితెలియరాలేదు.దాదాపు 24 గంటల దాటడంతో..మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
గజఈత గాళ్లతో పాటు పోలీసులు కూడా గల్లంతైన వ్యక్తి ఆచూకీకోసం వెతుకులాట చేపట్టారు. ముందు రోజు….భారీ వర్షానకి తోటుచెరవులో చేపలు పట్టేందుకు గేదెల రామ్మోహన్ రావు చెరువులోకి దిగాడు.ఎంతకీరాకపోవడంతో స్థానికులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో సీఐ మంగవేణి ఆదేశాలతో ఎస్ఐ నారాయణ…..వెతుకులాట చేపట్టారు.
ఈనెల 27 మధ్యాహ్నం నుంచీ సదరు గల్లంతుఅయినవ్యక్తి జాడ కోసం…ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఆచూకీ లభించకపోగా..చీకటి పడటంతో గాలింపు నిలుపుదల చేసారు… పోలీసులు. ఏదైనా.. రామ్మోహన్ ఆచూకీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మీకు గాని సదరు వ్యక్తి సమాచారం తెలిస్తే తక్షణం రూరల్ ఎస్ నారాయణ ను సంప్రదించాలని సత్యం న్యూస్.నెట్ కోరుతోంది