మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రాంనారాయణ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన పెనుశిల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన 25 మంది కౌన్సిలర్లు ఆయనతో బాటు ఉన్నారు. ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి నామ, నక్షత్రాల పై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి నామ, నక్షత్రాల పై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు దర్శన కార్యక్రమం విజయవంతమైందని, అదేవిధంగా స్వామివారి, అమ్మవారి ఆశీస్సులతో గురువారం నాడు ఉదయం 11 గంటలకు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, వెంకట నియోజకవర్గంలో ఏకగ్రీవంగా గెలిచిన జెడ్ పి టి సి, ఎంపీటీసీ సభ్యులు, వైయస్సార్ సిపి నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి లక్కమనేని కోటేశ్వరరావు, నక్కా వెంకటేశ్వర్రావు, చిట్టెటి హరికృష్ణ, ఎస్.కె.యస్దాని భాష, మాజీ కౌన్సిలర్ రొంటాల చిన్న, గొల్లగుంట ముని, గొల్లగుంట మురళి, తదితర ముఖ్య నాయకులు, 25 వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.