జనగామ మున్సిపాలిటీ ఎన్నికలలో23 వ వార్డు అభ్యర్థి మేకల రాంప్రసాద్ అత్యధిక మెజార్టీ 581 ఓట్లతో గెలిచారు. ఈ గెలుపు వెనుక తరిగొప్పుల ఎంపీపీ జొన్నగొని అరితా సుదర్శన్ గౌడ్ కృషి ఎంతో ఉందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. 23 వ వార్డుకు ఇంఛార్జి గా వవ్యహరించి అభ్యర్థిని గెలిపించుకునేందుకు మొదటి రోజు నుండి అహర్నిశలు కష్టపడుతూ, పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు, అభివృద్ధి గురించి వార్డు సభ్యులకు వివరిస్తూ, ఎంపీపీ జొన్నగొని అరితా సుదర్శన్ గౌడ్ తనదైన శైలిలో వ్యూహంతో ప్రణాళికలు సిద్ధం చేశారని ఎమ్మెల్యే అన్నారు.
ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు పడకుండా పూర్తి ఓట్లు టీఆర్ఎస్ కు పడేలా చేసి ప్రతిపక్ష పార్టీలు ఓటమికి గురయ్యేలా చేశారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థిని, ఎంపీపీ ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా తరిగొప్పుల ఎంపీపీ జొన్నగొని అరితా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ తమకు ఎమ్మెల్యే అప్పగించిన 23 వ వార్డు అభ్యర్థిని అత్యధిక మెజారిటీ తో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.