రూ. 6 లక్షల రూపాయల సొంత ఖర్చుతో గోల్నాక డివిజన్ జైస్వాల్ గార్డెన్ లోని శ్రీశ్రీశ్రీ మైసమ్మ దేవాలయానికి అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అదనపు సౌకర్యాలు కల్పించారు. దేవాలయానికి వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి షెడ్డు అవసరం ఉన్నది.
దాంతో భక్తుల సౌకర్యార్ధం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వారి సొంత ఖర్చు 6 లక్షల రూపాయల వ్యయంతో శాశ్వతంగా షెడ్డును నిర్మించారు. శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆయన సతీమణి గోల్నాక మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్ తో కలిసి ఈ షెడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.