వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె కోలగట్ల శ్రావణి 29 వ వార్డు నుంచి గెలుపొందారు. దీంతో మరోసారి ఎమ్మెల్యే స్వామి తన ఆధిపత్యం కొనసాగించారనే చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సలర్ ఎస్వీవీ రాజేష్..14 వ వార్డు నుంచీ గెలుపొందారు.
ఇక విజయనగరం ఒకటో వార్డు వైసీపీ అభ్యర్థి ని ముచ్చు నాగలక్ష్మి 1326 ఓట్లు సాధించుకొని ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ని చదురు పార్వతీ (658 ఓట్లు) పై 668 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు.
విజయనగరంలో 14వ వార్డు వైసీపీ అభ్యర్థి ఎస్వీఎస్ రాజేశ్వర్ రావు(రాజేష్)2037 ఓట్లు సాధించుకొని ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ని మద్దాల నాగ కుమారి (263) ఓట్లు) పై 1774 ఓట్లతో భారీ మెజారిటీతో గెలుపొందారు.