27.7 C
Hyderabad
April 19, 2024 23: 37 PM
Slider కరీంనగర్

ఎంపి ధర్మపురి అరవింద్ పై ఛీటింగ్ కేసు పెట్టాలి

jagityal mla

బిజెపి నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై చీటింగ్ కేసు పెట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని స్టాప్ పేపర్ పై రాసి ఇచ్చిన అరవింద్ పూర్తిగా విఫలమయ్యాడని ఆయన అన్నారు.

పసుపు పంటకు మద్దతు ధర ఇప్పిస్తామని లేదా రాజీనామా చేస్తా అని కూడా రాసి ఇచ్చిన ఆయన అన్ని రంగాలలో విఫలమయ్యాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఓట్ల కోసం రైతులను మభ్య పెట్టి రక రకాల మాటలు చెప్పి ఈనాడు పసుపు బోర్డు ఇప్పుడే కాదు ఇది దేశీయ పంట కాదు అని చెప్పడం మోసం చేయడమేనని ఆయన అన్నారు.

మోసం చేసి గెలిచారు కాబట్టి తక్షణమే అరవింద్ తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

Related posts

భయం వీడి… కరోనా వ్యాక్సిన్ దిశగా..

Satyam NEWS

మురుగన్ పై 112 పేజీల అభియోగ పత్రం

Satyam NEWS

కీసర ఎమ్మార్వో: వామ్మో ఇది అవినీతి అనకొండ

Satyam NEWS

Leave a Comment