జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన దుబ్బయ్య అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్(NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబం నేపథ్యంలో వారి ఆర్థిక స్థోమత లేని పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సిఎం సహాయ నిధికి లేఖ రాశారు.
ఎమ్మెల్యే సంజయ్క సిఫార్సు మేరకు సీఎం సహాయ నిధి ద్వారా రెండు లక్షల యాబై వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఎల్ ఓ సి ని బాధిత కుటుంబానికి నేడు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల తెరాస నాయకులు పాల్గొన్నారు.