జగన్ ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్ళ లో పలు అక్రమదందాలతో…ఎమ్మెల్యేలు బిజీ బిజీ గా ఉంటున్నారని,…తెలుగు దేశం పార్టీ నేత..దివంగత మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు కుమారుడు అప్పలనాయుడు విమర్శించారు. ప్రత్యేకించి…గజపతినగరం లో చంపావతి ఏరు సమీపంలో ఇసుక అక్రమరవాణా యధేచ్చగా సాగుతోందని…అందుకు స్థానిక ఎమ్మెల్యే… పోలీసులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై య్యారని కేఏ నాయుడు ఆరోపించారు.
ఈ మేరకు గజపతినగరం గరుడబిల్లి వద్ద అక్రమంగా ట్రాక్టర్ లలో రవాణా అవుతున్న ఇసుక ను..టీడీపీ గజపతినగరం ఇంచార్జి కేఏ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పట్టుకున్నారు. సదరు ట్రాక్టర్ డ్రైవర్ చూపించిన వే బిల్లులకు… చెప్పిన సమాధానం పొంతన లేకపోవడంతో… టీడీపీ శ్రేణులు ఆ అంశాన్ని సీరియస్ తీసుకున్నారు.
తక్షణమే సంబంధిత బొండపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేసిన… స్టేషన్ హౌస్ ఆఫీసర్.. ఎస్ఐ…అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారంటూ కేఏనాయుడు ఆరోపించారు. ఈ ఇసుక అక్రమరవాణా పై..తమ పార్టీ సీరియస్ గా తీసుకుంటోందని…తక్షణమే గజపతినగరం ఎమ్మెల్యే అటు జగన్ ప్రభుత్వం.. బొండపల్లి ఎస్ఐ పై ఇటు జిల్లా ఎస్పీ తగు చర్యలు తీసుకోవాలని కేఏ నాయుడు ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.