పర్యావరణం పరిరక్షణ,పచ్చదనం-పరిశుభ్రత,మొక్కలు నాటండి..ఆక్సిజన్ పెంపొందించండి..ఇలాంటి మాటలు, పదాలు, వాక్యాలు.. అప్పుడప్పుడు పుస్తకాలలోనూ, వ్యాపార ప్రకటనలలోనూ, లేదా ప్రభుత్వ అధికారులు నిర్వహించి కార్యక్రమాలలతో బ్యానర్లలో మీరు చూసి ఉంటారు.
కానీ పైన చదివిన వాటిని అన్నింటిని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ….అదీ అటవీ శాఖలో పని చేస్తూ…వాటిపైనే అతిగా శ్రద్ద పెట్టి పరోక్షంగా మొక్కల పెంపకానికి కారకుడైన అధికారి ఎవ్వరైనా ఉన్నారంటారా…? ఉన్నారంటోంది..సత్యం న్యూస్.నెట్. ఆయనే విజయనగరం జిల్లా అటవీ శాఖలో సోషల్ ఫారెస్ట్ విభాగపు జిల్లా అధికారి జానరీ రావు 31 వ తేదీన పదవీ విరమణ చేసారు.
ఈ సందర్భంగా ఓ జిల్లా ప్రభుత్వ అధికారిగా ఆయన చేసిన వృత్తి ని నిర్వహించే తీరు అనిర్వచనీయం.తానో గెజిటెడ్ అధికారి అని చూడకుండా.. మొక్కల పెంపకం విషయంలో ఓ సామాన్యుడిలా మారిపోతారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పచ్చతోరణం కార్యక్రమంలోనే గతేడాది నుంచీ ఆయన చేస్తున్న వృత్తి అద్ఛుతం. తాజాగా పదవీ విరమణ చేసిన సోషల్ ఫారెస్ట్ అధికారి జానకీ రావ్ ను విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆయనను సత్కరించారు.
ఈ మేరకు నగరంలోని బాబామెట్ట వద్ద జరిగిన కార్యక్రమంలో, మేయర్ వెంపడాపు విజయలక్ష్మితో పాటు ఎమ్మెల్యే కోలగట్ల ఘనంగా సన్మానించారు. జిల్లాలోనూ, నగరంలోనూ హరిత విజయనగరం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు డి.ఎఫ్.ఓ. జానకిరావు చేసిన కృషిని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కొనియాడారు.
నగరంలోని 5వ డివిజన్ బాబామెట్టలో శనివారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే, మేయర్ తదితరులు పాల్గొన్నారు. వృత్తిలో అంకితభావంతో కృషిచేసిన అధికారి అని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, జిల్లా యూత్ ఆఫీసర్ విక్రమాదిత్య, డా.వెంకటేశ్వరరావు, మునిసిపల్ ప్రజారోగ్య అధికారి డా.సత్యనారాయణ, హరిత విజయనగరం కో ఆర్డినేటర్ రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు, అటవీశాఖ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.