గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ లో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలలో ఆయన బాధితులను పరామర్శించారు.
ముమ్మరంగా చేపడుతున్న సహాయక చర్యలను ఆయన పర్యటించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తో బాటు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన వారిలో జోనల్ కమిషనర్ మమత, డీసీ ప్రశాంతి, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.