తన వద్ద పని చేసే ఆర్ఎస్ఐ అకస్మాత్తుగా మరణించడంతో చెలించిపోయిన ప్రభుత్వ చీప్ విప్ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతరావు ఆ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ములుగు మండలం దుబ్బాగుడెం కి చెందిన లక్ష్మణ్ ఎమ్మెల్యే వద్ద పని చేసేవారు.
ఆయన అకస్మాత్తుగా మరణించడంతో నేడు ఆయన కుటుంబాన్ని కలిసిన ఎమ్మెల్యే రేగ కాంతారావు తన వంతు సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా నాయకులు గండ్ర కోట సుధీర్, ములుగు జెడ్పీటీసీ సకినల భవాని, జెడ్పీటీసీ కో – ఆప్షన్ మెంబెర్ రియాజ్,
ములుగు పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్, ములుగు మైనారిటీ అధ్యక్షులు రజహుస్సెన్, ములుగు2 ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, మల్లంపల్లి ఎంపీటీసీ శీను, కొత్తూర్ ఎంపీటీసీ పుష్పలత సత్యం, పగిడి పల్లె సర్పంచ్ లక్ష్మి, ములుగు జిల్లా యువజన నాయకులు యం.డి.అజారుద్దీన్, మంద ప్రదీప్, యం.డి.అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.