38.2 C
Hyderabad
April 25, 2024 14: 54 PM
Slider మహబూబ్ నగర్

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బీరం

beeram 1

కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామములో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే వరి కొనుగోలు కేంద్రాన్ని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రైతులు కష్టించి పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని అన్నారు.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంతో పురోగమిస్తున్నదని, రైతుల  సంక్షేమం కోసం కట్టుబడిన ప్రభుత్వం ఇది అని ఈ సందర్బంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమములో మార్కెట్ యార్డ్ చెర్మెన్ నరేందర్ రెడ్డి, వైస్ చెర్మెన్ కురుమయ్య, జడ్పీ జిల్లా కోఆప్షన్ సభ్యులు మతీన్, జడ్పీటీసీ భాగ్యమ్మ, సర్పంచ్ లక్ష్మీ దేవమ్మ, ఎంపీటీసీ లు మంజుల, శంకర్, పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రిటాలియేషన్: అర్నబ్ గోస్వామిపై యూత్ కాంగ్రెస్ దాడి

Satyam NEWS

ప్ర‌సిద్దిగాంచిన విజ‌య‌న‌గ‌రం సంగీత‌ క‌ళాశాల‌లో క‌చేరీలు….!

Satyam NEWS

దుకాణం తెరవాలంటే జరిమానాల భయం

Satyam NEWS

Leave a Comment