35.2 C
Hyderabad
April 24, 2024 12: 05 PM
Slider గుంటూరు

శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

MLA NRT

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం తరపున నరసరావుపేట పట్టణంలో చేపట్టబోయే పనులను శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నేడు పరిశీలించారు. మరికొద్ది రోజుల్లో రాబోతున్న మహాశివరాత్రి కోడప్పకొండలో ఘనంగా జరిగే విషయం తెలిసిందే.

మహా శివరాత్రి పండుగ, కోటప్పకొండ జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చెయ్యాలని అన్నారు. మున్సిపాలిటీ వారు ఎక్కడ శానిటేషన్ సమస్యలు లేకుండా చూడాలని కొండకు వచ్చే భక్తులకు  మంచి నీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి శివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావలని కోరారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

కల్వకుర్తిలో కారు బేకారా ?

Satyam NEWS

పొలిటికల్ ఫైర్: రాజకీయ కారణాలతో 40 క్వింటాళ్ల మిర్చి దగ్ధం

Satyam NEWS

పోక్సో చట్టం కింద నిందితుడి కి 20 ఏళ్ల జైలు శిక్ష…!

Satyam NEWS

Leave a Comment