39.2 C
Hyderabad
April 25, 2024 18: 43 PM
Slider మెదక్

వరద బాధితులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏమిచ్చాడో తెలుసా?

#MLAJaggareddy

వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏం చేశారో తెలుసా? తన నియోజకవర్గం అయిన సంగారెడ్డి లోని సదాశివపేట మున్సిపాలిటీ లో నేడు సుడిగాలి పర్యటన చేశారు.

ఆయనతో బాటు ఆయన కుమార్తె జయరెడ్డి కూడా ఉన్నారు. అక్కడ అకాల వర్షానికి పాడైన రోడ్ల పరిస్థితి తెలుసుకొని అధికారులకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు.

తమ ఎమ్మెల్యే వచ్చాడని తెలుసుకుని పేద ప్రజలు పరుగెత్తుకుంటూ అక్కడకు వచ్చారు. తమకు కూలి లేదని, ఎలా బతకాలో అర్ధం కావడం లేదని ఎమ్మెల్యేకు చెప్పారు.

దాంతో ఆయన జేబులో నుంచి ఐదు వందల రూపాయల నోట్ల కట్ల తీసి అందరికి పంచిపెట్టారు. పేద ప్రజలు పలువురు వచ్చి ఆయన అందించిన సాయం అందుకుని సంతోషంగా వెళ్లారు. దటీజ్ జగ్గారెడ్డి.

Related posts

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యo

Murali Krishna

బీసీ గురుకుల పాఠశాలలో ప్రమాదం: ఒక చిన్నారి మృతి

Satyam NEWS

కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ మంత్రివర్గం

Satyam NEWS

Leave a Comment