బాగ్ అంబర్ పేట డివిజన్ బుర్జుగల్లీకి చెందిన సాంబశివుడుకి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తన సొంత ఖర్చుతో తయారు చేయించిన తోపుడు బండిని సోమవారం అందజేశారు. అతనికి ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎమ్మెల్యే అతనికి ఏమి కావాలని అడిగారు. చిరు వ్యాపారం చేసుకునేందుకు తనకు తోపుడు బండి కావాలని సాంబశివుడు ఎమ్మెల్యేకు చెప్పగా బండి తయారు చేయించి అందజేశారు. దానిపై పూలు, కూరగాయలు విక్రయించుకొని జీవనం పొందుతానని సాంబశివుడు చెప్పాడు. బండిని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని ఎమ్మెల్యే అతనికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె.లింగారావు, ఆర్కేబాబు, భాస్కర్ గౌడ్, అంబటి రవి, భూపతి లక్ష్మణ్, మిర్యాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్