Slider హైదరాబాద్

గడ్కరీతో కాకుంటే ప్రధాని మోదీతో ప్రారంభించుకోండి

#KaleruVenkatesh

అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో గత 8 ఏండ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. పక్కా ప్రణాళిక లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టడం వల్ల వేలాది మంది విద్యార్థులు, స్థానిక ప్రజలు నరకం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కనీసం సర్వీసు రోడ్డు వేయకుండానే ఫ్లైఓవర్ ను అధికారికంగా ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు.

ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ స్థానికులకు ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. సర్వీసు రోడ్లు వేసిన తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కాకపోతే ప్రధాని మోదీతో ప్రారంభించుకున్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అంబర్పేటలో 1.7 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో గోల్నాకలోని షాలేమ్ చర్చ్ వద్ద మొదలై అంబర్ పేటలోని ముకరం హోటల్ వరకు రూ.415 కోట్లతో ఒక ఫ్లైఓవర్ ను నిర్మించారు.

దీనిపై ఇప్పటికే రాకపోకలు సాగుతుండగా సోమవారం నాడు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోల్నాక క్యాంప్ క్యారాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ ఫ్లైఓవర్ ఏర్పాటుతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. అంబర్ పేట ఫ్లైఓవర్ నిర్మాణానికి మొత్తం రూ.415 కోట్ల ఖర్చు కాగా అందులో భూ నిర్వాసితుల కోసం జీహెచ్ఎంసీ నిధులు రూ.192 కోట్లు ఉండగా దాదాపు రూ.323 కోట్ల నిధులు నేషనల్ హైవే అథారిటీ వెచ్చించిందని తెలిపారు.

ఈ ఫ్లైఓవర్ పనులను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించినప్పటికీ భూసేకరణలో జాప్యం, మతపరమైన నిర్మాణాల అడ్డంకి తదితర సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు దాదాపు 8 ఏండ్ల పాటు నత్తనడకన  సాగాయని విమర్శించారు. పక్కా ప్రణాళికతో అధికారులు ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టకపోవడంతో స్థానికులు నరకం అనుభవిస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

గోల్నాక డివిజన్ చర్చి వద్ద ఎడమ వైపు నుంచి కుడి వైపునకు ప్రతి రోజు వెళ్లే వేలాది మంది విద్యార్థులు, స్థానిక వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇక చిన్న పాటి వర్షం పడ్డా బార్అంబర్ పేట డివిజన్లోని  బుర్జుగల్లీ, దోబిగల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ముంపు సమస్య ఏర్పడుతోందని తెలిపారు. దీనికి తోడు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చినా సర్వీసు రోడ్లు బాగు చేయకుండానే అర్భాటంగా  ఫ్లెఓవర్ ను అధికారింగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.

ఇన్ని సమస్యలు ఉన్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు.  ఇన్ని సమస్యలు ఉన్నా కేంద. కిషన్ రెడ్డికి అంబర్ పేట వాసులు ఓట్లు కావాలి కానీ, అభివృద్ధి మాత్రం పట్టడం లేదని ఆయన ఆరోపించారు. అంబర్ పేట ఫ్లై ఓవర్ నిర్మాణంతో వరంగల్ హైవే నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే కేవలం 10 శాతం మంది ప్రయాణికులకు మాత్రమే ఉపయోగపడుతోందని, స్థానికులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు.

ఇకనైనా ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్లు, గ్రీనరీ అభివృద్ధి, బ్యూటిఫికేషన్ పనులు పూర్తి చేసిన తర్వాతే ఫ్లై ఓవరు అధికారికంగా ప్రారంభించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.

సత్యం న్యూస్, అంబర్ పేట

Related posts

రఘురాముడికి ‘వై’ క్యాటగిరి రక్షణ కల్పించిన కేంద్రం

Satyam NEWS

రైతుల పోరాటానికి కేంద్రం స్పందించకపోవడం శోచనీయం

Satyam NEWS

అప్పుల తిప్పలు: రాజ్యంగ ఉల్లంఘన : సంకటంలో బ్యాంకులు

Satyam NEWS
error: Content is protected !!