తెలంగాణ తొలి సారిగా ఒక రాజకీయ నాయకుడికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అదీ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లుగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు.
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పొన్నాల లక్ష్మయ్యపై ఆయన దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత రెండు రోజులుగా ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టు చేయించుకున్నారు. టెస్టులో ఆయనకు పాజిటీవ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే ఈయనే కావడం గమనార్హం.