24.7 C
Hyderabad
March 29, 2024 06: 02 AM
Slider వరంగల్

అత్యాచారం చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే పి. ఏ పై చర్య తీసుకోవాలి

#mlaseetakka

అత్యాచారం చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే పి. ఏ పై చర్య తీసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. హన్మకొండ లో శివ శంకర్ లేడీస్ హాస్టల్ ను నేడు ఆమె సందర్శించారు. హాస్టల్ నిర్వాహకురాలు పై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం హాస్టల్ లో ఉంటూ ఎల్ ఎల్ బి చేస్తున్న యువతి పై అధికార పార్టీ ఎమ్మెల్యే పిఏ కన్నేశాడని ఆమె తెలిపారు. దాంతో అత్యంత దారుణానికి ఒడిగట్టాడు అని ఈ సంఘటనకు సూత్ర దారి అయిన హాస్టల్ నిర్వాహకురాలు తీరు మహిళా లోకానికే ఒక మచ్చ ల ఉందని ఆమె అన్నారు.

తోటి మహిళా అని చూడకుండా డబ్బుల కోసం అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ఇలా మహిళతో ఇలాంటి పనులు చేయించడం శోచనీయమని అన్నారు. సంఘటన జరిగి నేటికీ మూడు రోజులు కావస్తున్నా ఇంకా ప్రభుత్వం సంబంధిత మంత్రులు ఎందుకు స్పంచడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పి ఏ పైన  హాస్టల్ నిర్వాహకురాలును కఠినంగా శిక్షించాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి కుచణ  రవళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుక‌గా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

Satyam NEWS

పసుపు మార్కెటింగ్ లో కేంద్రం విఫలం

Satyam NEWS

ఉద్యోగాల పేరుతో  మోసం చేస్తున్న నిందితుడి అరెస్ట్

Satyam NEWS

Leave a Comment