39.2 C
Hyderabad
March 29, 2024 15: 23 PM
Slider నల్గొండ

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

#MLA Saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలో బుధవారం ప్రాధమిక వ్యవసాయ సహకర సంఘ కార్యాలయంలో మొక్కలు నాటి,కస్తూర్బా గాంధీ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేసి అనంతరం పలు గ్రామాలకు చెందిన 484 మంది లబ్ధిదారులకు శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

అనంతరం సైదిరెడ్డి మాట్లాడుతూ పెద్ద ఎత్తున రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.గత పాలకులు లిఫ్టు మరమ్మతులు మరిచారని,ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్ లను ఎప్పటి కప్పుడు ఆధునికరిస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తుందని,టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షాలు చూసి తట్టుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి  ఒక్కటే మా సమాధానమని,నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని అన్నారు. నూతనంగా రేషన్ కార్డులకు అప్లై చేసిన వారికి కూడా త్వరలోనే వస్తాయని తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మద్యం షాపులు తనిఖీ చేయాలి

Satyam NEWS

తిరుమలలో సులభంగా దర్శనం చేసుకోవడానికి మార్గాలు

Satyam NEWS

డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్

Satyam NEWS

Leave a Comment