బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమూ వీర్రాజు రాయలసీమపై చేసిన వ్యాఖ్యలపై కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేనే ఎమ్మెల్యేగా ఉండి ఉండ కుండా ఉంటే నీ నాలుక కోసేవాడినని ఓళ్లు కొవ్వెక్కి, బలిసి రాయలసీమ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బదీసేలా మాట్లాడతున్నావ్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాయలసీమ అందునా కడప జిల్లా ఔన్యత్యాన్ని, ప్రత్యేకతలను, గొప్పదనాన్ని గుర్తించకుండా చంపుకునే వారని హేయంగా మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేకుంటే నీతో క్షమాపణ చెప్పించే వరకు ఉద్యమిస్తామన్నారు.
రాయలసీమ అంటే ఏమిటో,కడప జిల్లా ఏమిటో ఇక్కడి ప్రత్యేకత ఏమిటో మీడియాను వెంటబెట్టుకుని నీ ఇంటికే వచ్చి పూసగుచ్చినట్లు వివరిస్తానన్నారు.జాతీయ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహించే అర్హత ఈ వ్యాఖ్యలతో సోమూ వీర్రాజు కోల్పోయారని, తక్షణం ఆయన్ను బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఈ నేల తల్లి బిడ్డలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.