37.2 C
Hyderabad
March 29, 2024 17: 30 PM
Slider మెదక్

ఆత్మహత్య చేసుకున్న రైతు వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యే రఘునందన్ అరెస్టు

#MLAraghunandan

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేముల గట్టు గ్రామంలో రైతు మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు లో తన ఇంటిని కూల్చడంతో అదే ఇంటి కట్టెలను చితిగా పేర్చుకుని అతను ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగిస్తున్నది.

మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న బిజెపి నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.

వేముల ఘాట్ వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను అరెస్ట్ చేసి గజ్వెల్ – బేగంపేట  పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకెళ్లారు.

సజీవ దహనం చేసుకుని మరణించిన మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి రైతులకు భరోసా కల్పించడానికి వేములఘాట్ గ్రామానికి వెళ్తున్న దుబ్బాక శాసనసభ్యుడిని మార్గమధ్యలో ఆపి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు.

Related posts

ఆరో విడత హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Satyam NEWS

కరోనా పై పోరాటానికి హెరిటేజ్ ఫుడ్స్ రూ.కోటి

Satyam NEWS

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

Leave a Comment