28.7 C
Hyderabad
April 24, 2024 03: 58 AM
Slider కృష్ణ

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

#MLA Roja

APIIC చైర్మన్, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ శాసనసభ్యురాలు ఆర్ కె రోజా నేడు విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రోజా కు ఆలయ చైర్మన్  పైలా సోమినాయుడు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు.

దర్శనం అనంతరం ఆమెకు వేద పండితులు ఆశీర్వచనాలు అందేశారు. ఆలయ అర్చకులు ప్రసాదాలు అందచేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులతో బాటు 20 వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అడపా శేషు, 52 వ డివిజన్ వైఎస్సార్సీపీ ఇంఛార్జి తంగెళ్ళ రామచంద్ర రావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు కోరాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Related posts

పోలీసులను దారుణంగా కొట్టిన ‘‘రైతులు’’

Satyam NEWS

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

Murali Krishna

ప‌ల్స్ పోలియోను విజ‌య‌వంతం చేయండి

Satyam NEWS

Leave a Comment