సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డిని శుక్రవారం స్థానిక జర్నలిస్టు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి, ఎల్లవేళలా అండగా ఉంటానని, జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను సిఎం కెసిఆర్,మంత్రి కెటిఆర్, జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని అన్నారు.
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులు,ఇండ్ల స్థలాల మంజూరుకు తనవంతు సహకారం తప్పక అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కోల నాగేశ్వరరావు,టివిఎల్,దాచేపల్లి దయాకర్ రెడ్డి,పిల్లలమర్రి శ్రీనివాస్,బి.శ్రీనివాసాచారి, దేనుమకోండ శేషంరాజు,కీతా రామనాథం, దేవరం రామిరెడ్డి,ఇందిరాల వెంకట్రామ్, ఇట్టిమల్ల రామకృష్ణ,దేవరం వెంకట రెడ్డి, పి భాస్కర్,చిట్టి పొతుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్