అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం పూలమాలలు వేసిన ఎస్టీ,బీసీ,ఎస్సీ నేతలు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎం.పి.పి గూడెపు శ్రీనివాస్ ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా అక్రమంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మున్సిపాలిటీ అధికారులుచే కూల్చి వేయించారని ఎస్టీ, బిసి,ఎస్సి నాయకులు స్థానిక ఇందిరాగాంధీ సెంటర్ లో ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
ఎమ్మెల్యే ఎస్టీ,బిసిఎస్సి లపై దాడులు చేయించి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ఆందోళన చేపట్టారు.అన్ని అనుమతులు ఉన్నా ఉద్దేశ పూర్వకంగానే ఎమ్మెల్యే ఇంటిని కూల్చి వేశారని అన్నారు. ఎమ్మెల్యే తో ప్రాణహాని ఉంది అని ఎంపిపి ఆరోపించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి ఎస్టీ,బిసి, ఎస్సి ల జోలోకివస్తే సహించేది లేదని రాష్ట్ర చాకలి సంఘం అధ్యక్షురాలు శ్రీ లక్ష్మీ అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్యే పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కొద్ది సేపు ఇందిరా సెంటర్ లో ఉద్రిక్తత చోటు చేసుకొంది.పోలీసులకు ఆందోళన కారుల మధ్య తోపులాట జరిగింది. ఎట్టకేలకు ఆందోళన కారులు పట్టణంలో ర్యాలీ చేస్తూ ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అంబెద్కర్ విగ్రహం వద్దకు వచ్చి పాలాభిషేకం చేసి, పూలమాల వేసి అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.అనంతరం ఎస్సై వెంకటరెడ్డి ఆందోళన కారులును పోలీస్ స్టేషన్ కు తరలించి కొద్ది సేపటికి విడిచిపెట్టారు.