34.2 C
Hyderabad
April 23, 2024 13: 12 PM
Slider నల్గొండ

ఘనంగా బొడ్రాయి మహాలక్ష్మి అంశ (శీతలా పరమేశ్వరి) ప్రతిష్ట

#saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలం నెమలిపురి కాలనీలో బుధవారం కన్నుల పండుగగా బొడ్రాయి ప్రతిష్ట,అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శీతలా పరమేశ్వరి (బొడ్రాయి),అభయ ఆంజనేయ స్వామి దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సైదిరెడ్డి మాట్లాడుతూ బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము అనేది మహాలక్ష్మి అంశ అని అన్నారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ గొప్ప నిర్వచనమని అన్నారు.బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అని,కొందరు కుల,మతాలను రెచ్చకొట్టి, అభివృద్ధిని మరిచారని,గతంలో ఎవరు కూడా క్రిష్టపట్టే గ్రామాలను పట్టించుకోలేదని,తాను స్థానికుడనే క్రిష్టపట్టే బిడ్డనే కనుక ఇక్కడ ఉండే పరిస్థితులు తెలిసే ప్రతి గ్రామనికి సి సి రోడ్లు,డ్రైనేజీలు, వసతులు కల్పించాలనని అన్నారు.

బొడ్రాయి గ్రామ భౌగోళిక పరిమాణం, గ్రామ నిర్మాణంపైన ప్రజలాంటిదరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని,ప్రతీ ఒక్కరు తమ తమ మత ఆచారాలకు అనుగుణంగా దైవ చింతనను కలిగి ఉండాలని,తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని, అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని,ఊరిలోని వారంతా కలిసి ఐక్యమత్యంగా ఉండాలని,గ్రామ బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనక ఉన్న ప్రధాన ఆంతర్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

Satyam NEWS

కాగజ్ నగర్ మండలంలో ఘనంగా బలిదాన్ దివస్

Satyam NEWS

చిన్న అంబానీకి ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్ సమన్లు

Satyam NEWS

Leave a Comment