27.7 C
Hyderabad
April 25, 2024 09: 34 AM
Slider నల్గొండ

మతి తప్పి మాట్లాడుతున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

#hujurnagarcongress

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు జోనల్ సభ్యుడు యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ముఖ్,కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు బాచిమంచి గిరిబాబు,వెలిదండ వీరారెడ్డి మాట్లాడారు.

స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ సభ్యుడు ఉత్తంకుమార్ రెడ్డి పై మాట్లాడిన మాటలను ఖండిస్తూ దేశం కోసం త్యాగం చేసిన సైనికుడి పై మాట్లాడిన తీరు ఎమ్మెల్యే కి మతి భ్రమించిన తీరుగా కనబడుతున్నదని అన్నారు. హుజూర్ నగర్ అభివృద్ధి అంటే ఉత్తంకుమార్ రెడ్డి దే అని, ఎంపీ నియోజకవర్గ అభివృద్ధికి కంకణం కట్టుకొని పనిచేస్తే స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి తన అక్రమ ఆస్తుల సంపాదన కొరకు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన ఏ ఎమ్మెల్యే చేయనటువంటి 500 కోట్ల అక్రమ ఆస్తులను సైదిరెడ్డి సంపాదించుకున్నది వాస్తవం కాదా అని వారు ప్రశ్నించారు.ఎమ్మెల్యే ఇకనైనా ఎంపీ పై చేసే వ్యక్తిగత దూషణలు మానుకొని రాజకీయ కోణంలో విమర్శలు ఉండాలని, లేకుంటే కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఘటించటం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బుల్లెద్దు  ధనమ్మ జైలు,పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు,పట్టణ ఉపాధ్యక్షుడు గొట్టేముక్కల రాములు,ఐ ఎన్ టి సి మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి,ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడు పాశం రామరాజు,వార్డు కమిటీ అధ్యక్షుడు కోళ్లపూడి యోహాన్, చింతకాయల రాము సులువ చంద్రశేఖర్ దొంతగాని జగన్,పల్లపు పెద్దబ్బాయి, బంటు సైదులు,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు కస్తాల సైదులు,తండు మిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

చిట్యాల పట్టణ ప్రగతికి నా వంతు సాయం చేస్తా

Satyam NEWS

బసవతత్వానుభవ మంటప ఉత్సవంలో పాల్గొన్న హరిష్

Satyam NEWS

మునిసిపల్ ఓట్లు మీకు అక్కర్లేదా మంత్రులూ?

Satyam NEWS

Leave a Comment