సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న కాలువల మరమ్మతులకు, లైనింగ్ పనులకు కావలసిన 1217.71 కోట్ల రూపాయల నిధులను హుజుర్ నగర్ నియోజకవర్గానికి మంజూరు చేస్తూ G.O No. Rt. 60 ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కి అందించడం జరిగినది.
నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి KCR కి, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంజూరు అయిన పనుల వివరాలు విధంగా ఉన్నాయి.
1.ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ మరమ్మత్తులు , వెల్లటూరు, చింతలపాలెం మండలం రూ. 817.50 కోట్లు.
2.జానపహాడ్ బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ మరమ్మతులు , గుండెబోయినగూడెం, పాలకీడు మండలం రూ. 118.70 కోట్లు.
3.ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ సిమెంట్ లైనింగ్ రూ. 184.60 కోట్లు.
4.జానపహాడ్ బ్రాంచ్ కెనాల్ సీసీ లైనింగ్ రూ. 52.11 కోట్లు.
5. NSLBC CC లైనింగ్ (0.000 Km – 70.520 Km ) రూ. 15.78 కోట్లు.
6. NSLBC సీసీ లైనింగ్ పనులు ( 70.520 Km – 115.400 Km) రూ. 20.02 కోట్లు.