సీతక్క అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిలపక్ష కన్వీనర్ ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు. రైతుల సమస్యలపై కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన అన్నారు.
ప్రజల పక్షాన మాట్లాడే ఎమ్మెల్యేను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకను అరెస్టు చేయడం సిగ్గుచేటని భిక్షపతి గౌడ్ అన్నారు. ములుగు ప్రాంత సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడదామంటే ఎమ్మెల్యేను మాట్లాడని ఇవ్వరు ఇక ములుగు ప్రాంత సమస్యలు ఎవరికి చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు.
ఇదేమి తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇదేనా అని భిక్షపతి గౌడ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు నకిలీ పురుగు మందులు అమ్ముతున్న తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రైతుబంధు భూస్వాములకు అందుతున్నది
నిరుద్యోగం పెరిగిపోతున్నది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించే గొంతుకను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధ ఇస్తున్నారని ఆయన అన్నారు.