అనారోగ్యంతో మరణించిన కాంగ్రెస్ నాయకుడి కుటుంబానికి అండగా నిలబడతామని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు.
ములుగు మండల కేంద్రానికి చెందిన పైడిమల్ల రాజుకుమార్ గారు ఇటీవలే మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క, వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, ములుగు ఎంపీటీసీ మవురపూ తిరుపతి రెడ్డి,వంగ రవి యాదవ్, యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,మేడం రమణ కర్, మండల ప్రధాన కార్యదర్శి తారక్ తదితరులు పాల్గొన్నారు.