36.2 C
Hyderabad
April 25, 2024 21: 14 PM
Slider ముఖ్యంశాలు

క్రిస్టియన్ లకు క్రిస్మస్ కానుకలు అందించిన ఎమ్మెల్యే సీతక్క

#MLA Seetakka

క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ కానుక, కళ్యాణ లక్ష్మి చెక్కులు లను ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు పంపిణీ చేశారు. నేడు గోవిందా రావు పేట మండలం తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో  20  మందికి  కళ్యాణ లక్ష్మి చెక్కులు అందచేశారు.

క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ కానుక లు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మండల అభివృద్ధికి కృషి చెయ్యాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అధికారులతో బాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, స్థానిక సర్పంచ్ జోగా నాయక్,  పసర సర్పంచ్ ముద్ద బోయిన రాము, ముదుర కోళ్ల తిరుపతి కుమార్ గౌడ్, వార్డు సభ్యులు చేరుకులా సురేష్, చింత క్రాంతి  తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీసులు నిర్వహించే స్పందనకు వచ్చిన ఫిర్యాదులు ఎన్నంటే…!

Satyam NEWS

పోగొట్టుకున్న విలువైన ఆభరణాలను తిరిగి ఇప్పించిన పోలీసులు

Satyam NEWS

కల్వకుర్తి మున్సిపాలిటీలో కట్టలు తెగిన అవినీతి

Satyam NEWS

Leave a Comment