ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రం లోని వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క దాతల సహకారంతో చీరలు బెడ్ షీట్లు పంపిణీ చేశారు.
ఓడ వాడ, ఎస్సీ వాడ నందమూరి నగర్ లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో గోదావరి వరద నీటి ఉధృతికి ఇళ్లు కోల్పోవడంతో 100 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. పునరావాస కేంద్రంలో ఉన్న 100 కుటుంబాలకు చీరలు దుప్పట్లు బియ్యం పప్పు నూనె తో పాటు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాబిన్ ఉడ్ ఆర్మీ ఆర్గనైజేషన్ రమ దామోదర్ సహకారం మరవలేనిదాని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయుభ్ ఖాన్, మండల అధ్యక్షులు చిటమట రఘు, ఎండీ ఆప్సర్ పాషా, జెడ్పీటీసీ నామ కరం చంద్ గాంధీ, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, వావిలాల చిన్న ఎల్లయ్య
ఎండీ ఖలీల్, ఎంపీటీసీ గుడ్ల దేవేందర్,రాము, మహిళా అధ్యక్షురాలు రాధిక, నర్సింహ రావు మహేష్, ఎండీ గౌస్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.