తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి ఆలయ ఈవో, పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సకాలంలో పడి పంటలు సుభిక్షంగా పండాలని స్వామివారిని కోరుకున్నారు. స్వామి వారి అనుగ్రహంతోనే పల్నాడు జిల్లా కేంద్రం సిద్ధించింది అని అన్నారు. రానున్న తిరునాళ్ళు కొండను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రసాద్ వితరణ కేంద్రాలను ప్రారంభించారు.