సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రం లోని దళిత కాలనీలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆకస్మిక పర్యటన చేశారు.
ఈ సందర్భంగా కాలనీ లోని ప్రధాన సమస్యలు, మౌలిక వసతుల సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనా కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడెం వెంకటరెడ్డి, ఎంపిపి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి,
మండల పార్టీ అధ్యక్షులు జోగు అరవింద రెడ్డి , ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.