28.7 C
Hyderabad
April 25, 2024 03: 43 AM
Slider నల్గొండ

హుజుర్ నగర్ పట్టణంలోపర్యటించిన శాసనసభ్యుడు శానంపూడి

#MLA

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పలు వార్డులలో గురువారం సాయంత్రం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పర్యటించారు. వార్డులలోని పలు వీధులలో తిరుగుతూ కరోనాతో మరణించిన వారి కుటుంబాలను,కోవిడ్ తో బాధపడుతున్న బాధితుల ఇంటికి వెళ్లి , స్వయంగా  బాధితులను పలుకలుస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కరోనా వ్యాధి బారిన పడినవారు ఎవరూ భయపడవద్దని, సరైన చికిత్స తీసుకుంటూ, దైర్యంగా ఉండాలని అన్నారు.ప్రజలు అందరూ తమ తమ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మన సంరక్షణే మనకు శ్రీరామరక్ష  అని అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ పై అవగాహన పెంచుకొని లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో TRS పట్టణ అధ్యక్షుడు అమర్ నాధ్ రెడ్డి,ఆయా వార్డుల కౌన్సిలర్లు,పలువురు TRS నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రామంతపూర్ మహా పడిపూజలో పాల్గొన్న ప్రముఖులు

Satyam NEWS

విమాన సర్వీసుల రద్దు పొడిగింపు

Sub Editor

ఏపీలో జైళ్లు సరిపోకపోతే లాడ్జిలు బుక్ చేసుకోండి

Bhavani

Leave a Comment