39.2 C
Hyderabad
March 29, 2024 14: 05 PM
Slider నల్గొండ

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం హుజూర్ నగర్ శాసనసభ్యుడు  శానంపూడి సైదిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అనంతరం వైద్యశాల సిబ్బందితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిధులు వెచ్చించి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఆశయంతో ఉన్నదని, అలాంటి ఆశయానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలవాలని సిబ్బందిని కోరారు.

సిబ్బంది సరైన సమయపాలన పాటిస్తూ, వైద్యశాలకు వచ్చే పేషెంట్లను గౌరవించాలని అన్నారు. నిరుపేద రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని డాక్టర్ల బృందాన్ని  కోరారు.

సమయపాలన పాటించని సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పేషెంట్ల వద్దకు వెళ్లి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.

Related posts

విజయ‌న‌గ‌రం కంటోన్మెంట్ హైస్కూలు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ దీపిక

Satyam NEWS

ఎక్కడివారు అక్కడే .. ఉత్తరాఖండ్ ప్రభుత్వ హెచ్చరిక

Sub Editor

నామినేషన్ దాఖలు చేసిన డింపుల్ యాదవ్

Bhavani

Leave a Comment