సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మెళ్ళచెర్వు మండల కేంద్రంలో శ్రీ మైసమ్మ అమ్మవారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పందిరిపల్లి శంకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బసవయ్య, ప్రధాన కార్యదర్శి బేత వీరనాగిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు సాతులూరి సురేష్, టిఆర్ఎస్ నాయకుడు బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.