రాజకీయాలు ప్రజా సేవ కే తప్ప ధనసంపాదన కోసం కాదని బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు అన్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఆయన నేడు కూకట్పల్లి మలేషియా టౌన్ షిప్ లో జరిగిన గ్రాడ్యుయేట్స్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ రాజకీయాలలో ప్రజాసేవ కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వారిని ప్రజలు ఎన్నుకోవాలన్నారు. సేవాభావం ఉన్నావారే రాజకీయాలలోకి రావాలని పిలుపునిచ్చారు
ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండాలని దేశాభివృద్ధికి వారు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని సూచించారు గత ప్రభుత్వాలు మతాల వారీగా విభజించి ప్రజలను మోసం చేసి పాలించార ని రామచంద్ర రావు ధ్వజమెత్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.