వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సిపిఎం, సిపిఐ వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి జయసారథి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు నెమ్మది వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయసారధి రెడ్డి విద్యావంతుడు, ఉద్యోగుల, నిరుద్యోగ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తని, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేయగల వ్యక్తని తెలిపారు. అందువల్ల పట్టభద్రులు జయసారథి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నాగారపు పాండు, మండల కార్యదర్శి ములకలపల్లి సీతయ్య, కౌన్సిలర్ త్రివేణి, వెంకటేష్, వీరబాబు, వీరమల్లు, రేపాకుల మురళి, వీరస్వామి,దుగ్గి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.