సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం షేక్ షబ్బీర్ అలీని గెలిపించాలని ప్రచారంలో భాగంగా బుధవారం MDR స్కూల్ చైర్మన్ దామోదర్ రెడ్డిని కలిసి తమకు మద్దతు తెలపాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం హుజూర్ నగర్ నాయకులు కోరారు.
గత పది నెలలుగా ప్రైవేట్ టీచర్లకు జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం చాలా బాధాకరమని, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టే నాగరాజు యాదవ్ అన్నారు.
ప్రయివేట్ టీచర్ల అభ్యర్థిని మనమే గెలిపించుకొని మన సమస్యలను మనమే పరిష్కరించుకునే రోజు అతి తొందరలోనే ఉందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలలో సుమారుగా లక్షకు పైగా ప్రైవేటు టీచర్లు ఉన్నారని,తమ ఓటుతో పాటు తమ బంధువులతో, మిత్రులతో ఓటు వేయమని చెప్పి తమ అభ్యర్ధిని గెలిపిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నల్లబొలు భూపాల్ రెడ్డి, పింగళి నర్సిరెడ్డి, ఇందిరాల శ్రీనివాస్, బానోతు రమేష్,మన్నెం నాగరాజు, పిల్లి ఆనంద్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.