28.2 C
Hyderabad
April 20, 2024 12: 37 PM
Slider నిజామాబాద్

నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతా

#mlckavita

అనుకోకుండా ఎంపీ అయిన అరవింద్ చిల్లర మాటలు ఆపకపోతే నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ గా అరవింద్ లాంటి వ్యక్తి ఉండటం దురదృష్టకరమని ఆమె అన్నారు. పార్లమెంటు లో అరవింద్ పనితనం సున్నా….పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేశాడు అంటూ కవిత ఫైర్ అయ్యారు.

అరవింద్ ది ఫేక్ డిగ్రీ.. దీనిపై నేను రాజస్థాన్ యూనివర్సిటీ కి పిర్యాదు చేస్తాను అని కవిత తెలిపారు. నిన్న ప్రెస్ మీట్లో నీచంగా మాట్లాడినందునే తాను ఈ విధంగా స్పందించాల్సి వస్తున్నదని, తాను ఎవరిని ఎప్పుడు వ్యక్తిగత దూషణలు చేయనని కవిత అన్నారు.

అరవింద్ బురద లాంటోడు రాయేస్తే మనపైనే పడుతుంది అని ఆమె అన్నారు. అరవింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోంది.. బాధేస్తుంది..నేను సమస్యల మీద మాట్లాడతాను.. వ్యక్తుల ఎపుడూ మీద మాట్లాడలేదు…కానీ అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదు అని కవిత అన్నారు.

కుక్క కాటు కు చెప్పు దెబ్బ తప్పదు…మళ్లీ నా గురించి పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తా లో చెప్పు తో కొడతా…ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నా అని ఆమె ఆవేదనతో అన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు తాను ఖర్గే తో మాట్లాడాను అనేది శుద్ధ తప్పు అని ఆమె చెప్పారు. తనకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని కూడా ఆమె చెప్పారు. అయితే తన రాజకీయ ప్రయాణం కేసీఆర్ తోనేనని కవిత అన్నారు.

Related posts

మోడీ ఆన్ ఫైర్: 12 రోజుల్లో పాకిస్తాన్ ను ఓడిస్తాం

Satyam NEWS

డాక్టర్ అనితా రెడ్డి కి స్టేట్ బెస్ట్ లీడర్ అవార్డు

Satyam NEWS

ఆపదలో ఉన్నా వారికి రక్తదానం చేద్దాం నిండు ప్రాణాన్ని కాపాడుదాం

Satyam NEWS

Leave a Comment