40.2 C
Hyderabad
April 19, 2024 15: 05 PM
Slider నిజామాబాద్

చదువుల తల్లికి ఎమ్మెల్సీ కవిత భరోసా

చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్ గూడ కు చెందిన హారిక కు కవిత అండగా నిలిచారు.

ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తక్షణమే స్పందించారు. తన నిజామాబాద్ పర్యటనలో హారికను కలిసి కవిత ఎంబిబిఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని భరోసానిచ్చారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…

చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హారిక ఎంబిబిఎస్ చదువులో రాణించి , వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. కవిత తన చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకుగాను హారిక తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్వాగానికి లోనయ్యారు. తాను బాగా చదువుకొని కవిత గారు సూచించినట్లుగా సమాజానికి తోడ్పాటునoదిస్తానని హారిక అన్నారు.

Related posts

సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలను సందర్శించిన నాగపంచమి సీరియల్ బృందం

Satyam NEWS

పుట్లూరు అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

ప్రాచ్య విద్యలను నేర్చుకొని కాపాడవలసిన బాధ్యత విద్యార్థులపై ఉంది

Satyam NEWS

Leave a Comment