హైదరాబాద్ లోని శేరి లింగంపల్లి నియోజకవర్గం లోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కాలనీ లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆదేశానుసారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు.
అదే విధంగా ధరణి యాప్ లో ఇంటి ఆస్తుల రక్షణ కోసం చేపట్టిన కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి శ్రీకారం చుట్టారు.
కాలనీవాసుల దగ్గర నుండి ఓటరు నమోదు పత్రాలని తీసుకున్నారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నదని తెలిపారు.
అధికారులు ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలను సేకరిస్తున్నారని, యజమాని, ఇతర కుటుంబసభ్యుల వివరాలను అడిగి నమోదు చేసుకొంటున్నారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు ఎలాంటి ధ్రువపత్రాలు సేకరించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు బిల్ కలెక్టర్ వినోద్ వారి సిబ్బంది కాలనీ వాసులు, టిఆర్ఎస్ నాయకులు రమణ రెడ్డి, సాంబశివరావు,రమణయ్య, వెంకటరమణ, చంద్రశేఖర రావు, సురేష్, సుబ్రమణ్యం, కిషోర్ కుమార్, పశుపతి, యశ్వంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.