హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ లోని పల్లె ఎన్క్లేవ్ కమ్యూనిటీ హాల్లో శనివారం నిర్శహించాన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రానికి విశేష స్పందన లభించిందని పల్లె ఎన్క్లేవ్ కాలనీ అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ అడిగిన వెంటనే మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
పల్లె ఎన్క్లేవ్ కాలనీకి చుట్టు ప్రక్కల కాలనీలలోని ప్రజలు మొబైల్ వాక్సినేషన్ కేంద్రానికి తరలి వచ్చారని, వారు మొదటి, రెండవ వాక్సిన్ వేయించుకున్నారని ఈ అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించకోవాలని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి కనుకుల రజనీకాంత్రెడ్డి, కోశాధికారి ఇంద్రసేనారెడ్డి, పల్లె ప్యారడైజ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ధనసాగర్రెడ్డి, బీజెఆర్ కాలనీ అధ్యక్షులు ఎస్.ఎ.రహీమ్ తదితరలు పాల్గొన్నారు.