భారత రాజ్యాంగానికి విశిష్ట స్థానం ఉందని తెలంగాణ భవిష్యత్ వేదిక అభిప్రాయపడింది. తెలంగాణ భవిష్యత్ వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో మాక్ అసెంబ్లీ నిర్వహించి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పదవుల కోసం, సంపద కోసం ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టు ఎమ్మెల్యే లను ప్రజలు దూరం పెట్టాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. అలాంటి రాజకీయ నాయకులను ప్రజలే దారిలో పెట్టాలి…ప్రజాచైతన్యం ద్వారానే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యం అని వారన్నారు. ఈ మాక్ అసెంబ్లీలో BJYM కొల్లాపూర్ మండల అధ్యక్షులు గంగం మల్లేష్ యాదవ్ పాల్గొని కొల్లాపూర్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. నియోజకవర్గ సమస్యలను ప్రభావవంతంగా ప్రస్తావిస్తూ అక్కడున్న అతిథులను ఆకట్టుకున్నారు. 118 అసెంబ్లీల నియోజకవర్గాల నుంచి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొన్న వారిలో 7 గురు బెస్ట్ ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేయగా అందులో ఒకరుగా సౌత్ ఇండియా ఖాదీ ఇండస్ట్రియల్ బోర్డ్ మెంబర్ పేరాల శేఖర్ జీ, జాతీయ NYK వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్ న్యూస్ చైర్మన్ నరోత్తం రెడ్డి చేతుల మీదుగా బెస్ట్ యువ ఎమ్మెల్యేగా మల్లేష్ పురస్కారం అందుకున్నారు.