34.2 C
Hyderabad
May 19, 2025 17: 52 PM
Slider చిత్తూరు

తిరుమలలో మాక్ డ్రిల్: అణువణువూ గాలింపు

#Tirumala

భారత సరిహద్దు వద్ద ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, భద్రతా అప్రమత్తత పెంచడంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచనల మేరకు, తిరుపతి ఎస్పీ వి హర్ష్ వర్ధన్ రాజు, టీటీడీ సీవీఎస్ఓ ఆదేశాల మేరకు, ఈరోజు తిరుమలలో మాక్ డ్రిల్ జరిగింది. సివిల్ పోలీసులు: 20 మంది సిబ్బంది, ఆక్టోపస్: 25 మంది సిబ్బంది, టిటిడి విజిలెన్స్: 20 మంది సిబ్బంది, ఎఆర్ మరియు ఎపిఎస్పి: 38 మంది సిబ్బంది, బిడి టీం మరియు డాగ్ స్క్వాడ్: 18 మంది సిబ్బంది మొత్తం: 121 మంది సిబ్బంది ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు.

నాలుగు బృందాలుగా విడిపోయి అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు నిర్వహించారు. అలాగే రద్దీగా ఉండే ముఖ్యమైన ప్రాంతాలలో చుట్టుపక్కల బ్యాగులు, సామాను, వదిలివేసిన వస్తువులపై విధ్వంసక నిరోధక తనిఖీలు నిర్వహించారు, ప్రత్యేకంగా జిఎన్‌సి నుండి సిఆర్‌ఓ, బస్టాండ్ మరియు పద్మావతి ప్రాంతం, అఖిలాండం నుండి గొల్ల మండపం వరకు, నాలుగు మాడ వీధులు, హాథి రాంజీ ముత్ మరియు రామ్ బగీచా వరకు, నందకం, వరాహ స్వామి విశ్రాంతి గృహ ప్రాంతం, ఆక్టోపస్ సర్కిల్ వరకు, గోకులం ప్రాంతం నుండి ఎంబిసి వరకు, శ్రీవారి మెట్టు చేరుకునే స్థానం, ఎస్వీ గెస్ట్ హౌస్ సర్కిల్ ప్రాంతాలను జల్లెడపట్టారు.

Related posts

అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష

Satyam NEWS

కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ వైఫల్యం

Satyam NEWS

తెలంగాణ విముక్తికి తుది పోరాటం ఆరంభం కావాలి

Satyam NEWS
error: Content is protected !!