విజయనగరంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ కు కొత్త బిల్డింగ్ నిర్మాణం పనులు చివరి దశకు చేరుకోనున్నాయి. ఈ నెలాఖరుకు గాని వచ్చే నెల మొదటివారంలోగాని ప్రారంబించేందుకు పోలీసు అధికారులు సన్నద్దం అవుతున్నారు.
మరోవై.పు నగరంలోని దిశ పోలీస్ స్టేషన్ ను సీఎం జగన్ ప్రారంభించితే ఈ టూటౌన్ పీఎస్ ను హోం మంత్రి సుచరితచే ప్రారంభించాలని డీఎస్పీ అనిల్ యోచిస్తున్నారు.ఈ మేరకు స్టేషన్ భవన నిర్మాణ పనులను స్థానిక సీఐ శ్రీనివాసరావుతో కలిసి కొత్తపేట నీళ్ల ట్యాంక్ వద్ద నిర్మితం అవుతున్న కొత్త భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
దాదాపు 9 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 2 వేల చదరపు మీటర్లలో ఈ కొత్త స్టేషన్ నిర్మాణం జరుగుతోంది.అధునాత సౌకర్యాలు, మెన్ ,వుమెన్ సిబ్బందికి డ్రెస్సింగ్ రూమ్,విశ్రాంతి గదులతో పాటు సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు ప్రత్యేక ఛాంబర్, ఆలాగే ఇద్దరు ఎస్ ఐలకు వేర్వేరు గదులు, పిర్యాదుల కోసం వచ్చే వారికి విశాలంగా హాలు, రిసెప్షన్ నిర్మాణాలు తయారవుతోంది.ఇక స్టేషన్ ఎంట్రన్స్ లో నిందితుల కోసం జైలు నిర్మాణ పనులు కూడా సిద్దం అవుతున్నాయి.
మొత్తం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ప్లోర్ లతో నూతన పోలీస్ స్టేషన్ ను రూపుదిద్దుకుంటోంది. కొసమెరుపు ఏంటంటే..రెండేళ్లుగా స్టేషన్ కొత్త భవన నిర్మాణం పనులు చేపడుతున్న కాంటాక్టర్ కు ఏపీపోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డబ్బులు చెల్లించడంలో ఆలస్యమైంది. అయితే కొత్తగా వచ్చిన డీఎస్పీ చొరవతో సుమారు 60 లక్షలు మంజూరు అవ్వడంతో స్టేషన్ కొత్త భవన నిర్మాణ పనులు శరవేగంగా మొదలవుతున్నాయి.