పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు దిగాలంటే మోడీని గద్దె దించాలి అని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో జరిగిన పార్టీ సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలు, గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెంచాడు ధరలు పెంచడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్నాడన్నారు. రైల్వే, ఎల్ఐసి , విశాఖ ఉక్కు, బిఎస్ఎన్ఎల్, విమానాశ్రయాలు ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని బూర్జువా పెట్టుబడిదారులందరికీ అప్పజెప్తున్నాడని, అందుకోసం మోడీని గద్దె దించేదాకా ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని, మోడీ అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని ప్రజల్ని నమ్మబలికి మోసం చేశాడన్నారు..
అలాగే స్విస్ బ్యాంకులలో ఉన్న నల్ల డబ్బులు తీసుకువచ్చి ప్రజల ఖాతాలలో ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసి, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఉచిత వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన మోడీని వెంటనే గద్దె దించాలని, లేదంటే ఈ దేశానికి మోడీ బిజెపి ప్రభుత్వం చాలా ప్రమాదకరం అన్నారు. ఈ దేశాన్ని మరలా బ్రిటిష్ వాళ్ళకి అమ్మడానికైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి ప్రజలందరూ ఆలోచించి రాబోయే ఎన్నికలలో మోడీని గద్దె దించాలి అని ఆయన అన్నారు.