28.7 C
Hyderabad
April 20, 2024 04: 08 AM
Slider నల్గొండ

దత్త సంస్థలకు మేలు చేస్తున్న ప్రధాని మోడీ

#roshapati

మోడీ అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని ప్రయివేటు దత్త సంస్థలకు తెగనమ్ముతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు ములకలపల్లి రాములు అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ అనుసరిస్తున్న దివాలాకోరు విధానాల వల్ల దేశం విచ్ఛిన్నం అవుతుందని అన్నారు.

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ విధానాలను త్రిప్పి కొట్టాలని,సేవ్ అగ్రికల్చర్,సేవ్ ఇండియా పేరుతో ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములు కావాలని అన్నారు. మోడీ విధానాలు దేశ స్వావలంబనకు ప్రమాదంగా ఉందని, మోడీ గో బ్యాక్ నినాదంతో ప్రజలు ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు.

మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగష్టు 9వ,తేదీ వరకు అన్ని గ్రామాల్లో ప్రజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు, జిల్లా రైతు సంఘం నాయకులు పల్లె వెంకటరెడ్డి,నాగారపు పాండు,హుస్సేన్, సైదులు, సి ఐ టి యు జిల్లా నాయకుడు ఎలక సోమయ్య గౌడ్, ఆదినారాయణ,వెంకన్న,వీరబాబు, వీరస్వామి,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

Satyam NEWS

ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన ఉండాలి

Satyam NEWS

కొండ్రావుపల్లి కాలువలో మునిగిపోయిన యువకుడు

Satyam NEWS

Leave a Comment