నేడు కేరళను తాకాల్సిన రుతుపవనాలు మరో నాలుగు రోజులు ఆలస్యంగా రానున్నట్టు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. కేరళ చేరిన తర్వాత వారం రోజులకు రాయలసీమ, 10-12 రోజులకు తెలంగాణాపై విస్తరిస్తాయి. అరేబియా
సముద్రంపై దట్టమైన మేఘ సమూాహాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నందున ఆలస్యమైనా వర్షాలకు కొదవ ఉండదని IMD అంచనా వేస్తోంది. గత ఏడాది మే 31 నే మాన్సూన్ కేరళను పలకరించింది. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి వారం పైగా ఆలస్యమవుతున్నట్టే.