ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్కన బేరీజు వేస్తూ అవే తన బలమని మోదీ అన్నారన్న హరీశ్ రావు, మరి భాజపా నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ని ఎంతో బలవంతుడిని చేసి ఉంటాయన్నారు. ప్రధానమంత్రిగా దేశానికి, తెలంగాణకు మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ఏం చేశారని అడిగితే తిడుతున్నారని చెబుతూ పలాయనం చేయటం ఎంత వరకూ భావ్యం మోదీజీ అంటూ ప్రశ్నించారు.
previous post
next post